సముద్రంలో బోటు బోల్తా, పడవలో సీఎస్ (ఎక్స్ క్లూజివ్ వీడియో)

ముంబైలోని అరేబియా సముద్రంలో స్పీడు బోటు బోల్తా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక పనులను పరిశీలించేందుకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ మేటే, ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ అధికారుతో సహా 25 మంది ఉన్నారు. మరో బోట్ లో 40 మంది జర్నలిస్టులు ఉన్నారు.

సముద్రంలో బోట్ కు రాళ్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మునిగిపోగా ఇద్దరిని కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడారు. తప్పి పోయిన ఒక్కరి కోసం  గాలింపు కొనసాగుతుంది. మిగిలిన వారంతా సేఫ్ గా బయట పడ్డారు. సీఎస్ తో సహా మిగిలిన నేతలు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వీడియో కింద ఉంది చూడండి.