చెన్నైలో దారుణం… బాయ్ ఫ్రెండ్ చూస్తుండగానే యువతి పై అత్యాచారం!

ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో మగవారికి సమానంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గటం లేదు. అంతేకాకుండా ఈరోజుల్లో మహిళల మీద అత్యాచార నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేరాలకు అడ్డుకట్ట వేయటానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్న కూడా అత్యాచారాలు సంఖ్య తగ్గించడం కష్టతరంగా మారింది . తాగిన మైకంలో ఏమి చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో సామూహిక అత్యాచారాలకు పాల్పడి యువతుల జీవితాలు నాశనం చేయడమే కాకుండా, వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.

తాజాగా తమిళనాడులోని కాంచీపురంలో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 సంవత్సరాలు యువతిని తన స్నేహితుడి ముందే ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాంచీపురం పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కాంచీపురానికి చెందిన యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ మీద షికారుకు వెళ్లారు. ఊరి బయట నిర్మానుష్య ప్రాంతంలో వీరు బైక్ ఆపడం గమనించిన ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి వీరిని సమీపించారు.

ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు మొదటగా యువకుడిపై దాడి చేసి అతడిని కట్టేశారు. అనంతరం యువతీ మేడ మీద కత్తి పెట్టి తమకు సహకరించకుంటే ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు. వీరు మరొక నలుగురిని పిలిచి యువతిని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్ళి… మొత్తం ఆరుగురు ఒకరి తర్వత ఒకరు యువతి పై లైంగిక దాడి చేశారు. అనంతరం ఇద్దరిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత ఆ జంట పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటన గురించి వివరించి ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు. మరొక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఆరుగురిపై అత్యాచారం, లైంగిక ఆరోపణలు కేసు నమోదుచేసినట్లు తెలిపారు పోలీసులు.