కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదిలు ఖరారు

ఫిబ్రవరి 1వ తేదిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల తేదిలను కేంద్రం ఖరారు చేసింది. జనవరి 31 వ తేది నుంచి ఫిబ్రవరి 13 వరకు కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. 2019 – 2020 బడ్జెట్ కు సంబంధించి అక్టోబర్ నుంచే ఆయా శాఖల ప్రతిపాదనలను కేంద్రం కోరుతోంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ హాయాంలో ఇది చివరి బడ్జెట్.