అమెరికాలో తెలంగాణ యువకుడి పై కాల్పులు

అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. వరంగల్ జిల్లా కు చెందిన యువకుడి పై దుండగులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మహబూబాబా పట్టణానికి చెందిన పూస  ఎల్లయ్య, శైలజల కుమారుడు కృష్ణ. మిచ్ గాన్ రాష్ట్రంలోని లారెన్స్ టెక్ యూనివర్సిటిలో ఎంఎస్సీ చదువుతున్నాడు. 

జనవరి 3న రెస్టారెంట్ కు వెళ్లి పార్సిల్ తీసుకొచ్చుకుంటుండగా గుర్తు తెలియని దుండగులు అతనిని అనుసరించి అతని పై కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న నగదు, ఉంగారాలు, ఫోన్ లతో పాటు అతని కారును కూడా తీసుకొని పారిపోయారు. గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణ పరిస్థితి తెలుసకున్న తల్లిదండ్రులు విషాదవదనంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికారులతో మాట్లాడి కృష్ణ కు మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. వారు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.