ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఇంట్లో ప్ర‌కాష్ రాజ్‌

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సుమారు అరగంట పాటు ప్ర‌కాష్ రాజ్ ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌ బెంగ‌ళూరు సెంట్ర‌ల్ లోక్‌స‌భ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

తాము అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌బోమ‌ని వెల్ల‌డించింది. ప్ర‌కాష్ రాజ్ గెలుపు కోసం కృషి చేస్తామ‌ని ఆప్ క‌ర్ణాట‌క రాష్ట్ర శాఖ నాయ‌కులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌కాష్ రాజ్ మ‌ర్యాద‌పూర‌కంగా కేజ్రీవాల్‌ను క‌లిశారు. అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. త‌మ భేటీలో ఇత‌ర రాజ‌కీయాలేవీ ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని, త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త తెల‌ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.