విలాసాలకు అలవాటు పడిన భార్య….భర్తకు తెలియకుండా ఆ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అలాంటి జీవితం గడపడం కోసం డబ్బు సంపాదించడానికి అనేకమార్గాలు ఎంచుకుంటున్నారు. కొంతమంది దొంగతనాలు దోపిడీలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటే మరికొంతమంది ఇతరులను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.అయితే కొంతమంది మహిళలు కూడా ఇలాంటి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో విలాసాలకు అలవాటు పడిన భార్య డబ్బుల కోసం తన భర్తకు తెలియకుండా తన అండాలను అమ్ముకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళ్తే… ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో అమ్రైవాడీ పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అమ్రైవాడీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో అనిత అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లయిన దగ్గర నుండి అనిత తన అత్తమామలతో తరచూ గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలో భార్య ఒత్తిడి భరించలేక ఆమె భర్త వేరు కాపురం పెట్టాడు. అయితే అనిత తన భర్త సంపాదన సరిపోవడం లేదని ప్రతిరోజు అతనితో గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలో భార్యభేదింపులు భరించలేక అనిత భర్త అతని తల్లితండ్రుల వద్దకు వెళ్ళాడు. కొంతకాలం క్రితం అనితకి భర్తతో సఖ్యత కుదరటంతో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు.

అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అనిత భర్తను డబ్బులు అడగకుండా అండాలను అమ్మి డబ్బు సంపాదిస్తోంది. ఇటీవల ఈ విషయం గురించి తెలుసుకున్న భర్త భార్యను నిలదీయగా ఈ విషయం బయటికి చెప్తే తనని చంపేస్తానని బెదిరించింది. దీంతో అనిత భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో భాగంగా.. అండాల విక్రయానికి వీలుగా అనిత ఆధార్‌ కార్డులో పుట్టినతేదీని మార్చుకున్నట్లు, భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. 2019 జనవరి నుంచి 2022 జూన్‌ మధ్య పలుమార్లు ఆమె అండాలను విక్రయించినట్లు విచారణలో వెల్లడించింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.