తాంత్రికుడి మాయలో పడి నాలుగు నెలల చిన్నారిని బలి ఇచ్చిన తల్లి.. ఎంత దారుణం?

రోజు రోజుకి దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికీ ఎంతోమంది ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది దొంగ బాబాలు ప్రజలకు మాయ మాటలు చెప్పి వారిని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా మరికొంతమంది దొంగ బాబాలు అన్యాయంగా మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా కూడా ఇలాంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మాంత్రికుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతనికోసం తన నాలుగు నెలల చిన్నారిని బలి ఇచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనౌదిహ్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక తాంత్రికడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన కోరికలు తీర్చుకునేందుకు నాలుగు నెలల చిన్నారిని బలి ఇచ్చింది. ఆ తంత్రికలు కోరిక మేరకు మహిళ తన కన్న బిడ్డను ఇలా బలి ఇవ్వటం సంచలనంగా మారింది. గ్రామంలోని ఒక నల్లటి విగ్రహం ముందు పారతో తన బిడ్డను నరికి బలి ఇచ్చింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇక ఆ మహిళను ప్రేరేపించిన తాంత్రికడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.