ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ నెంబ‌ర్స్ ఇవే..!

ఇండియాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకీ దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున న‌మోద‌వుత‌న్నాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో కొత్త‌గా 28,701 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, క‌రోనా కార‌ణంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ప్ర‌స్తుతం ఇండియాలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 8,78,254 లక్షలకు చేరుకుంది. ఇక భార‌త్‌లో ప్రస్తుతం 3,01,609 క‌రోనా యాక్టివ్ కేసులున్నాయి. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుండి కోలుకుని 5,53,471 మంది డిశ్చార్జి అయ్యారు.