పవన్ కళ్యాణ్‌కి మళ్లీ నో చెప్పిన అనసూయ.!

బుల్లితెరపై యాంకర్‌గా పాపులరైన అనసూయ భరద్వాజ్, సుకుమార్ పుణ్యమా అని రంగమ్మత్తగా వెండితెరపై అవతారమెత్తింది. ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మత్త’ పాత్ర అనసూయ కెరీర్‌ని టర్న్ చేసేసింది. ఆ సినిమా తర్వాత సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది. ఎప్పటికీ బుల్లితెరను విడిచి పెట్టనని ఒట్టేసి చెప్పిన అనసూయ, సినిమాల్లో బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆ ఒట్టు తీసి గట్టు మీదెట్టి ఫ్లేట్ ఫిరాయించేసింది.

అసలు విషయానికి వస్తే, తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాకి అనసూయ నో చెప్పిందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలోనూ అనసూయ ఇలాగే చేసిందని ప్రచారం జరిగింది. తాజాగా ఇంకో సారి ఇదే టాక్ వినిపిస్తోంది.

అయితే, అది ఏ సినిమా అని క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ‘వినోదయసితం’ పూర్తయిపోయింది. ‘హరి హరవీరమల్లు’ ఆన్ ది వే. రీసెంట్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్టయ్యింది.

అనసూయ నో చెప్పిన సినిమా బహుశా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యుంటుందని అంటున్నారు. ఇది జస్ట్ గాలి మాటో, నిజంగానే డేట్స్ అడ్జస్ట్ చేయలేక అనసూయ నో చెప్పిందో తెలియాల్సి వుంది.