తమన్నా నటించిన ” దటీజ్ మహాలక్ష్మి ” ఎక్కడ ..?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘దటీజ్ మహాలక్ష్మి’. బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవడంతో అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ సినిమా మీద తమన్నా చాలా ఆశలు పెట్టుకుంది.

Life Lessons from movie Queen about social stigma that young Indian women  face

కాగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న నేపథ్యంలో…సెన్సార్ పని లేకుండా ‘దటీజ్ మహాలక్ష్మి’ నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను విక్రయించడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్, అనుష్క శెట్టి, నాని నటించిన సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే.

మరి ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా పరిస్థితి ఏంటన్నది మేకర్స్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాగా ఈ సినిమాను తమిళంలో కాజల్ అగర్వాల్ తో రూపొందించారు. ‘పారిస్ పారిస్’ టైటిల్‌తో తమిళంలో కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలాగే, మంజిమా మోహన్ హీరోయిన్‌గా మలయాళంలో ‘ జామ్.. జామ్ ‘ పేరుతో తెరకెక్కింది. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెలుగు, తమిళ వర్షన్లకు దర్శకత్వం వహించగా.. కన్నడ, మలయాళ రీమేక్స్‌‌ను రమేష్ అరవింద్ డైరెక్ట్ చేశారు.