కొత్త ఏడాది సంచలన నిర్ణయం తీసుకున్న… మరి విగ్నేష్ పరిస్థితి ఏంటో?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఈ ఏడాది డైరెక్టర్ విగ్నేష్ నుప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే జూన్ నెలలో వీరి వివాహం కాగా అక్టోబర్ నెలలో వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.ఇలా పెళ్లయిన నాలుగు నెలలకి నయనతార దంపతులు తల్లిదండ్రులు కావడంతో వీరిద్దరూ ఎన్నో వివాదాలు చిక్కుకున్నారు. అయితే ఈ వివాదాల నుంచి బయటపడిన ఈ దంపతులు ప్రస్తుతం వారి సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.

నయనతార పెళ్లి అయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇకపోతే కొత్త ఏడాది రావడంతో వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కొత్త సంవత్సరంలో నయనతార ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి కొత్త ఏడాదిలో నయనతార తీసుకున్న నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే…

నయనతార ఇప్పటివరకు సినిమాలలో నటించి సంపాదించిన ఆస్తి మొత్తం తన భర్త విగ్నేష్ కు కొంత భాగం చెందుతుందని భావించారు. అయితే ఇప్పుడు మాత్రం ఈమె తన ఆస్తి మొత్తం తన ఇద్దరి కొడుకు పేరు మీద రాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన భర్త కన్నా తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నటువంటి నయనతార ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇలా తన ఆస్తి మొత్తం పిల్లల పేరు పై రాయడంతో మరి విగ్నేష్ పరిస్థితి ఏంటి అని నేటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.