ప్లాప్స్ ఇచ్చినా మళ్ళీ ఆఫర్ ఇస్తున్న వరుణ్??

ఇప్పుడు టాలీవుడ్ మెగా హీరోస్ కానీ మెగా ఫాన్స్ విషయం కానీ చాలా దారుణంగా ఉందని చెప్పాలి. గడిచిన ఈ రెండు నెలల్లో కూడా వరుసగా మూడు సినిమాలు ఉన్నాయని ఆనందపడాలో లేక వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ లు అయ్యాయని బాధ పడాలో అన్నట్టుగా వారు ఉన్నారు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ల నుంచి వచ్చిన చిత్రం “బ్రో” కొంచెం పర్వాలేదు కానీ నెక్స్ట్ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున చిత్రాలు అయితే కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచి భారీ నష్టాలు మిగిల్చాయి.

దీనితో ఈ చిత్రంతో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ రెండు ప్లాప్ లు అందుకున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ గా రెండు ప్లాప్ చిత్రాలు చేసిన నిర్మాణ సంస్థలకి మళ్ళీ ఇంకో ఆఫర్ ని అయితే వరుణ్ తేజ్ ఇచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా గతంలో వచ్చిన గని సినిమా నిర్మాతలకి నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తానని మాట ఇవ్వగా..

ఇప్పుడు గాండీవ దారి విషయంలో కూడా భోగవల్లి ప్రసాద్ కి ఇంకో సినిమా తాను చేస్తానని చెప్పాడట. దీనితో ప్లాప్స్ నుంచే మళ్ళీ ఇంకో సినిమా ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఆ చిత్రాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. కాగా ఈ సినిమాలు అయినా హిట్ అవుతాయో లేదో చూడాలి మరి. ఇప్పుడు అయితే తాను మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.