ఉస్తాద్ భగత్ సింగ్.! అయోమయంలో మైత్రీ.!

ఎట్టకేలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ మళ్ళీ పట్టాలెక్కనుంది. కొద్ది రోజులపాటు జరిగిన షూటింగ్ అనంతరం, సినిమా నుంచి ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేసేశారు ఆ మధ్య.

అంతే, ఆ తర్వాత మళ్ళీ సినిమా ఏమాత్రం ముందుకు కదల్లేదు.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ అలాగే ‘బ్రో’, ఇంకా ‘ఓజీ’ సినిమాల షూటింగుల నేపథ్యంలో.

‘బ్రో’ విడుదలైపోయిన దరిమిలా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద పవన్ ఫోకస్ పెట్టారు. కొద్ది రోజుల్లోనే షూటింగ్ పునఃప్రారంభమవనుంది. ఇంతలోనే, ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్ళారు, ‘బ్రో’ సినిమాకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేసేందుకోసం.

ఈ వ్యవహారంతో మైత్రీ మూవీ మేకర్స్ ఉలిక్కిపడింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్స్. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ తరహాలో ‘మైత్రీ మూవీ మేకర్స్’ ధైర్యంగా పవన్ తరఫున నిలబడితే ఫర్లేదు. లేదంటే, అంతే సంగతి.! ప్రస్తుతానికైతే మైత్రీలో కొంత అయోమయం వుందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.