“బ్రో” కోసం భారీగా ఛార్జ్ చేసిన బాస్ బ్యూటీ.?

ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి స్టార్టింగ్ లోనే పలు పెద్ద సినిమాలు వచ్చేసాయి. మళ్ళీ మార్చ్ చివరలో దసరా మినహా పెద్ద సినిమా అయితే ఏది లేదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న కాస్త పెద్ద సినిమా మాత్రం “బ్రో”. సాయి ధరమ్ తేజ్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో ఉండడంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై అయితే నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఒకో అప్డేట్ వస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సాంగ్ కోసం మేకర్స్ లేటెస్ట్ ఐటెం బాంబ్ “వాల్తేరు వీరయ్య” బాస్ పార్టీ సాంగ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ని అయితే తీసుకున్నారు.

కాగా ఇందులో ఊర్వశి మంచి గ్లామ్ షో తో కూడా అలరించింది. అయితే ఈ ఒక్క సాంగ్ కోసం అందులోని లిమిటెడ్ సమయం ఉన్నప్పటికీ ఆమె ఏకంగా 1 కోటి రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గా తెలుస్తుంది. జస్ట్ చిన్న సాంగ్ తక్కువ నిడివికే ఆమె ఇంత మొత్తం తీసుకోవడం షాకింగ్ అని చెప్పాలి.

దీనితో ఈ టాక్ అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఊర్వశి ఇంత తీసుకుంటుందా అని వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తుండగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అలాగే థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ జూలై 28న అయితే రిలీజ్ కాబోతుంది.