బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా మారింది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తన స్టయిల్తో హైలెట్ అవుతున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాఖండ్లో తన పేరుతో ఆలయం ఉందని చెప్పిన ఊర్వశి, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అలాంటి గుడి కావాలని కోరిక వెలిబుచ్చింది.
ఊర్వశి మాట్లాడుతూ – “ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ పక్కనే నా పేరు మీద గుడి ఉంది. మీరు అక్కడకి వెళ్తే తప్పక చూసి రండి” అని చెప్పింది. అంతే కాకుండా, ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు తన ఫోటోకు పూలమాలలు వేసి పూజించడం తనను ఆశ్చర్యపరిచిందని గుర్తు చేసింది. ఈ గౌరవం తనను ఎంతో ఉత్సాహపరిచిందని, దక్షిణ భారతదేశంలో కూడా తనకు ఉన్న ఫాలోయింగ్ను బట్టి అక్కడ గుడి నిర్మించాలని ఆశపడటం వింత కాదని వెల్లడించింది.
ఆమె మాటలపై యాంకర్ ఆసక్తికరంగా స్పందించగా, ఊర్వశి నవ్వుతూ “గుడిలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఆశీర్వాదాల కోసం వస్తారు” అని హాస్యంగా సమాధానమిచ్చింది. అయితే ఆమె చేసిన ఈ కామెంట్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు “తనంత తానే దేవతలా ఫీల్ అవుతోందా?” అంటూ విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం “ఇది తేలికపాటి కామెడీ కావచ్చు” అంటూ సమర్థిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, ఊర్వశి రౌతేలా ఇటీవల సౌత్లో వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో ఆకట్టుకుంది. బాలకృష్ణతో డాకు మహారాజ్ చిత్రంలో ‘దబిడి దబిడి’ పాటలో అదిరిపోయే గ్లామర్ షో ఇచ్చింది. ఇప్పుడు తన ఆలయ కోరికతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అభిమానులు గుడులు కట్టిన సందర్భాలు ఉన్నా, తామే ఆలయం కోరడం అరుదు. మరి ఊర్వశి ఆశ నెరవేరుతుందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.