ప్రైవేట్ ఫోటోలతో బెదిరింపులు.. టీవీ నటి ఆత్మహత్య

TV Actress Sravani Committed Suicide

సోషల్ మీడియాలో జరిగే మోసాలు అందరికీ తెలిసిందే. ప్రేమ పేరుతో వల వేసి మోసం చేస్తుంటారు. ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే టీవీ సీరియల్ నటికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. టిక్‌టాక్ పరిచయం చివరకు ఆమె ప్రాణాలను తీసింది. మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న ఘటన టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.

TV Actress Sravani Committed Suicide
TV Actress Sravani Committed Suicide

నటి శ్రావణి హైదరాబాద్‌ మధురానగర్‌లో నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లింది. లోపల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారణ చేశారు.

ఎనిమిదేళ్లగా టీవీ ఇండస్ట్రీలో ఉన్న శ్రావణి ప్రస్తుతం మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌తో పాటూ మరికొన్నింటిలో నటిస్తోంది. టిక్ టాక్‌ పరిచయంతో వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణి గత కొన్నేళ్లగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీతో టిక్ టాక్ పరిచయం ఏర్పడిందట. తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆమెకు దగ్గరయ్యాడట. ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగి, వాటిని బయటపెడుతానని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బంధువులు ఆరోపించారు.వేధింపులు అధికం కావడంతో ఇటీవల ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.