Karthika Deepam Bhagyam: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా అంటూ ఎమోషనల్ బుల్లితెర నటి… కారణం అదేనా?

Karthika Deepam Bhagyam: బుల్లితెర అయినా వెండితెర అయినా ఆర్టిస్టుల జీవితాలు తెర ముందు ఒకలాగా తెర వెనుక ఒకలాగా ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు,కష్టాలు ఉన్న తెరపైన వాటిని కన్పించనికుండా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. వారి వ్యక్తిగత జీవితాలు మాత్రం తెర మీద కన్పించినంత అందంగా ఉండవు. కళ్యాణ వైభోగం, కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి అర్ధ పావు భాగ్యంగా అందరికి సుపరిచితురాలు కార్తీక దీపం సీరియల్ తో చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టి అందులో ఉమత్త గా ఫేమస్ అయింది. అయితే బూతులు మాట్లాడటం, గొడవలు పడటంతో 2 వ వారంలోనే ఎలిమినేట్ అయింది.

అయితే ఆ తర్వాత సీరియల్ అవకాశాలు తగ్గాయి. ఆల్రెడీ చేస్తున్న సీరియల్స్ నుండి కూడా ఆమెను తొలగించారు. బిగ్ బాస్ లో తన దురుసు ప్రవర్తన, బూతులు తిట్టడం వంటి వాటి వల్ల ఆ షో నుండి బయటికి వచ్చాక చాలా నెగెటివిటీ ను మూటగట్టుకుంది. ఈ మధ్యనే మళ్ళీ కొత్త సీరియల్స్ లో అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెరపై ప్రసారమవుతున్న స్టార్ మా పరివార్ కార్యక్రమంలో చెల్లెలి కాపురం, శ్రీమతి శ్రీనివాస్ సీరియల్స్ పోటీపడ్డాయి. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇందులో ఉమాదేవి ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.

ఉమాదేవి ఈ కార్యక్రమంలో తన కూతుర్ల గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తను చాలా స్ట్రాంగ్ అని అందరు అనుకుంటారు.. తను స్ట్రాంగే కానీ తన ఇద్దరమ్మాయిల భవిష్యతూ ఆలోచిస్తూ పెద్దమ్మాయి పెళ్లీడుకు వచ్చింది.. నేను చేద్దామని దగ్గరకు వెళ్లినా రానివ్వడం లేదు.. ఇద్దరు ఆడపిల్లలను ఏసుకుని ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక్కదాన్నే పోరాడుతూ పోరాడుతూ చాలా అంటే చాలా కుమిలిపోయాను.. నేను పెళ్లి చేస్తానా? నా అల్లుడు వస్తాడా? మీ అమ్మ ఇలాంటిది కదా? అని వాళ్ల జీవితాలు నా వల్ల పాడవుతాయా? అనే ఆలోచనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు .పైకి గయ్యాళిలా కనిపించే ఉమాదేవి నిజజీవితంలోని ఇబ్బందులు చెప్పి అందరిని కదిలించారు.