బ్రో సినిమాలో త్రివిక్రమ్ మార్క్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ బ్రో. ఈ సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం సముద్రఖని దర్శకత్వంలో సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. సుమారు వంద కోట్ల రూపాయిల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొని ఉన్నాయి. పవర్ స్టార్ అభిమానులు కూడా బ్రో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంది.

అయితే తమిళంతో పోల్చుకుంటే ఈ సినిమా స్టొరీ, స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశారు. తమిళంలో సముద్రఖని, తంబి రామయ్య లీడ్ రోల్ చేశారు. తంబి రామయ్య పాత్రని కంప్లీట్ గా మార్చేసి తేజ్ ని ఎంపిక చేశారు. ఇక తమిళంలో ఆ మూవీ సీరియస్ నోట్ లో ఉంటుంది. అయతే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు రెగ్యులర్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని బ్రో స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా క్లైమాక్స్ లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో బ్రో సినిమా కథనం త్రివిక్రమ్ సిద్ధం చేసారంట. అలాగే అందరికి కనెక్ట్ అయ్యే విధంగా పవర్ ఫుల్ డైలాగ్స్ ని హ్యూమర్ జోడించి రాసారంట. ఇవి సినిమాలో హైలైట్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

మరి మామ, అల్లుళ్ళు కలిసి కనిపించబోతున్న ఈ మూవీ ప్రేక్షకులని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విరూపాక్ష తర్వాత తేజ్ నుంచి రాబోతున్న సినిమా కావడం, అలాగే మెగా హీరోలు ఒకే సినిమాలో కలిసి కనిపించబోతున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.