ఈరోజు నా జీవితంలో ఎప్పటికి డార్క్ డే.. సురేఖా వాణి కూతురు పోస్ట్ వైరల్!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో అక్క, వదిన, పిన్ని పాత్రలో నటించి అందరిని మెప్పించిన నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సురేఖవాణి కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా తన కూతురిని పరిచయం చేసిన ఈమె తన కూతురుతో కలిసి చేసే హంగామా అందరికీ తెలిసిందే.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండి హీరోయిన్ పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇకపోతే సుప్రీత తన తల్లి సురేఖవాణి గత కొద్ది రోజుల క్రితం థాయిలాండ్ వెళ్లి ఎంతో చిల్ అయ్యారు.అక్కడే తన తల్లికి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ చేసి తన తల్లికి కాస్ట్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఇలా నిత్యం తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఇకపోతే తాజాగా సుప్రీత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన తండ్రి సురేష్ తేజతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ
ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ డార్క్ డే.. ఐ మిస్ యు యువర్ వాయిస్ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. సుప్రీత తండ్రి సురేష్ తేజ 2019లో అనారోగ్య సమస్య కారణంగా మే 7వ తేదీ మృతిచెందారు. ఈ క్రమంలోనే ఆయన వర్ధంతి సందర్భంగా సుప్రీత తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ఫోటో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.