కలెక్షన్లలో ‘టిల్లుస్క్వేర్‌’ దూకుడు!

టాలీవుడ్‌ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌ ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ ‘టిల్లు స్క్వేర్‌’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ తెచ్చకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం మార్చి 29న విడుదలై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ చిత్రం ఓపెనింగ్‌ వీకెండ్‌లో రూ.68.1 కోట్లు వసూళ్లు రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా వెళ్తుంది. మూడు రోజుల థ్రియాట్రికల్‌ జర్నీలో కలెక్షన్ల విషయంలో నైజాం ఏరియా కీలక పాత్ర పోషించిందనే ట్రేడ్‌ విశ్లేషకుల అంచనా. ఆదివారం ఒక్కరోజే ‘టిల్లు 2’ నైజా ఏరియాలో రూ.3.30 కోట్లు రాబట్టింది. నైజాంలో మూవీ మొత్తం వసూళ్లు రూ.10.50 కోట్లు.. ఓ వైపు ఐపీఎల్‌ మేనియా కొనసాగుతున్నా ఓపెనింగ్‌ వీకెండ్‌లో రూ.10 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయి తన స్టామినా ఏంటో మరోసారి రుజువు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ.

టిల్లుకు మాస్‌ ఆడియెన్స్‌ ఏ రేంజ్‌ లో కనెక్ట్‌ అయ్యారో తాజా వసూళ్లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ మేనియా ఇలాగే కొనసాగితే ‘టిల్లు 2’ అతి త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవడం పక్కా అని అర్థమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ నిర్మించిన ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మురళీధర్‌ గౌడ్‌, ప్రణీత్‌ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. సినిమా క్లయిమాక్స్ షాకింగ్‌గా ఉండటమే కాదు.. ప్రేక్షకులంతా స్టన్‌ అవడం గ్యారంటీ అని సిద్దు ముందుగా చెప్పినట్టుగానే ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసినట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్‌ చెబుతోంది.