నష్టాలపై ఓపెన్ అయ్యిన “టైగర్ నాగేశ్వరరావు” నిర్మాత..!

ఈ ఏడాది టాలీవుడ్ పెద్ద పండుగల దగ్గర రిలీజ్ కి వచ్చిన అనేక చిత్రాల్లో ఈ దసరా మహోత్సవం కానుకగా వచ్చిన చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్స్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతూ చేసిన చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”.

రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల అయ్యాక కాస్త ఓకే అనిపించే రేంజ్ రెస్పాన్స్ ని అందుకుంది. కానీ సినిమాకి పెట్టిన రేంజ్ బడ్జెట్ కానీ జరిగిన బిజినెస్ మేర వసూళ్లు అందుకోలేదు. దీనితో స్వల్పంగా నష్టాలు వచ్చాయి అనేది ఉన్న మాటే కాగా ఈ నష్టాలు విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించడం వైరల్ గా మారింది.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ తమ చిత్రానికి ఏమీ నష్టాలు రాలేదు అని తెలుగు రాష్ట్రాల్లో సినిమాని తామే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము మాకు రావాల్సిన అంతా వచ్చింది నష్టాలు అనేది లేదు అటు థియేట్రికల్ గా ఇటు నాన్ థియేట్రికల్ గా కూడా తాము సేఫ్ గానే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.

సో టైగర్ నాగేశ్వరరావు విషయంలో నష్టాలు వచ్చాయని చెప్పడానికి ఇక లేదు. మరి ఈ భారీ చిత్రాన్ని అయితే కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించగా జివి ప్రకాష్ సంగీతాన్ని అందించాడు. నాజర్, మురళీ శర్మ, రేణు దేశాయ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు.