పవన్ “బ్రో” లో క్లైమాక్స్ హైలైట్ ఇదే.!

ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “బ్రో ది అవతార్” అని చెప్పాలి. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ వెర్సటైల్ నటుడు సముద్రఖని అయితే దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే తెలుగులో తనకి ఇదే మొదటి సినిమా కాగా తమిళ్ లో తాను చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఐతే తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ సాయంతో మన నేటివిటీకి తగ్గట్టుగా అదిరే మార్పులు చేర్పులు చేసి రిలీజ్ కి తీసుకొస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ అయితే పెద్ద హైలైట్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో డివోషనల్ టచ్ ఉంటుంది అని అందరికి తెలిసిందే. అయితే మోడ్రన్ దేవునిగా పవన్ చేసిన ఈ పాత్రకి అనుగుణంగా సాయి తేజ్ పై ఒక 20 నిమిషాల పాటు అద్భుతమైన క్లైమాక్స్ ఉందట.

ఇది కంప్లీట్ గా డిఫరెంట్ టోన్ లో చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది. దీనితో ఈ సినిమాలో క్లైమాక్స్ ఒకటి సెపరేట్ హైలైట్ అని అంటున్నారు. మరి ఈ ఎమోషనల్ క్లైమాక్స్ అయితే ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూలై 28 వరకు ఆగాల్సిందే.