బాలయ్యతో బోయపాటి కూడా చెయ్యని సీక్వెన్స్ ఈ దర్శకుడు చేస్తున్నాడట

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం తర్వాత అయితే బాలయ్య క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలు ఫ్యాన్స్ కి అందించిన బాలయ్య వీటి తర్వాత చేస్తున్న భగవంత్ కేసరి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇప్పటికే అర్ధం అయ్యింది.

కాగా ఈ చిత్రం తర్వాత బాలయ్య కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అయ్యినటువంటి తానూ ఓ క్రేజీ సబ్జెక్టు బాలయ్య కోసం డిజైన్ చేసాడు. ఇది అయితే అనౌన్సమెంట్ తో భారీ అంచనాలు రేపగా ఈ సినిమాపై నిర్మాతలు చెప్తున్నా మాటలు మాస్ ఆడియెన్స్ లో మరింత హైప్ ఎక్కిస్తున్నాయి.

అయితే ఇప్పుడు జెనరేషన్ లో బాలయ్యని చూపించాలి అంటే అది ఒక్క బోయపాటి వల్లే అని అందరికీ అర్ధం అయ్యింది. మళ్ళీ లేటెస్ట్ గా వీరసింహా రెడ్డి లో గోపీచంద్ మలినేని బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసాడు. అయితే ఒకప్పుడు బాలయ్య బి గోపాల్ ఎలాగో ఇప్పుడు బాలయ్య బోయపాటి అన్నట్టుగా మారింది.

మరి ఈ రేంజ్ సెన్సేషన్ రేపిన ఈ కాంబో కూడా టచ్ చేయని ఓ క్రేజీ సీక్వెన్స్ ని బాబీ బాలయ్య కోసం ఆ సినిమాలో డిజైన్ చేసాడట. బోయపాటి కూడా బాలయ్య గారిని ఆ లెవెల్లో ఇప్పటివరకు చూపించలేదు. మొదటిసారి బాబీ చూపించబోతున్నాడు అని నిర్మాతలు తెలుపుతున్నారు. అంటే ఇక అది ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.