మోసం చేస్తే మూల్యం తప్పదు.. ప్రభాస్ సినిమాపై మా ప్రెసిడెంట్ కామెంట్స్ వైరల్?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా బారీ ట్రోలింగ్ ఎదుర్కొంది.రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యాన్ని ఇలా యానిమేషన్ చిత్రంగా చూపించడం పట్ల ఈ టీజర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఇక చాలామంది ఈ టీజర్ విషయాన్ని తప్పు పడుతూ కామెంట్లు చేయగా మరికొందరికి ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్ పై మంచు విష్ణు స్పందించారు. తాజాగా ఆయన నటించిన జిన్నా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్నటువంటి మంచు విష్ణు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ తనను ఎంతగానో నిరాశపరిచిందని తెలిపారు.

ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎన్నో అంచనాలను పెట్టుకున్నామని అయితే ఈ టీజర్ చూసిన తర్వాత తనకు చాలా నిరాశ కలిగిందని విష్ణు తెలిపారు.రామాయణం వంటి ఒక సినిమాని యానిమేటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మోసం చేశారని ఈ మోసం ఫలితమే ఈ సినిమా టీజర్ భారీ ట్రోలింగ్ ఎదుర్కొందని ఈయన తెలిపారు.సినిమా విడుదలకు ముందు ఈ సినిమా యానిమేటెడ్ సినిమా అని చెప్పి ఉంటే ఈ టీజర్ పై ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగి ఉండేది కాదేమో అంటూ ఈ సందర్భంగా విష్ణు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.