Bheemla Nayak: కథకు అడ్డంగా ఉందని ఆ పాటను తొలగించాం.. ఆ పాట విషయంలో క్లారిటీ ఇచ్చిన తమన్!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు మదిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది.సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ నిత్యా మీనన్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ అంత ఇష్టం ఏందయ్యా నీకు అనే పాట కనిపించడం లేదు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పాట విడుదలకు ముందు సినిమా విడుదలైన తర్వాత కూడా ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.

ఇలా ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ పాటను సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు తమన్ ఓ ఇంటర్వ్యూలో ఆశక్తికరమైన సమాధానం తెలియజేశారు.బాగా వేడి వేడిగా ఉన్న పొయ్యి మీద నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో ఈ పాట కూడా అలాగే ఉందని ఈ సినిమా కథ మొత్తం ఎంతో ఎమోషనల్ గా సాగుతున్న నేపథ్యంలో ఈ పాటను పెట్టడం వల్ల సినిమా ఫ్లో కి అడ్డంకిగా మారిందని అందుకే ఈ పాటను తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

అందుకే అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పాటను సినిమా నుంచి తొలగించామని తమన్ ఈ పాటను తొలగించడానికి గల కారణం తెలియజేశారు.ఇకపోతే ఫిబ్రవరి 25వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజులకే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత తను నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.