బాలయ్య కాల్షీట్ కోసం రెండు కోట్లు తీసుకెళ్లిన నిర్మాత.. నిర్మాతకు షాక్ ఇచ్చిన బాలయ్య?

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు టాక్ షోలను కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న బాలకృష్ణ తన సినిమాలను నిర్మించే నిర్మాతలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో వీరు పెద్దగా నిర్మాతలను ఒత్తిడి చేయరని టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇకపోతే గతంలో బాలకృష్ణతో జరిగినటువంటి ఓ విషయాన్ని నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తన బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా పవిత్ర ప్రేమ అనే సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో బాలయ్య క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఇకపోతే ఈ సినిమా తర్వాత చంటి అడ్డాల మరోసారి బాలకృష్ణతో సినిమా చేయాలని భావించారట. ఈ క్రమంలోనే సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచి ఉంటారని భావించి తన కాల్ షీట్స్ అడగడం కోసం తన వెంట రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకువెళ్లినట్టు తెలియజేశారు.

ఈ విధంగా బాలకృష్ణ గారు రెండు కోట్లు తప్పకుండా అడుగుతారు ఆయనను బ్రతిమలాడి 1.5 కోట్ల రూపాయలకు ఒప్పిద్దామని వెళ్లారట.ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాని తన బ్యానర్లో చేయాలని చంటి అడ్డాల కోరడంతో అందుకు బాలయ్య ఏ మాత్రం అడ్డు చెప్పకుండా సరే అని చెప్పడమే కాకుండా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ…ముందు సినిమా కోసం 60 లక్షలు తీసుకున్నాను ఇప్పుడు కూడా అంతే ఇవ్వండి వీలైతే ఒక ఐదు లక్షలు పెంచమని చెప్పారట. ఇలా బాలకృష్ణ చెప్పడంతో ఒక్కసారిగా నిర్మాత షాక్ అయ్యానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. తాను రెండు కోట్లు అడుగుతారని భావించి రెండు కోట్లు వెంట తీసుకెళ్లగా బాలకృష్ణ మాత్రం 65 లక్షలు తీసుకుంటానని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని, బాలకృష్ణ గారు అలా చెప్పేసరికి తన మనసులో తానే దండం పెట్టుకున్నానని నిర్మాత చంటి అడ్డాల పేర్కొన్నారు.