Pawan Kalyan: సినిమానే నాకు అన్నం పెట్టింది.. పవన్ సంచలన వ్యాఖ్యలు…!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఫిబ్రవరి 23 న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తెలంగాణ మినిస్టర్స్ KTR, తలసాని యాదవ్ అలాగే దానం నాగేంద్ర హాజరయ్యారు. భీమ్లా నాయక్ సినిమా లో రానా దగ్గుబాటి నిత్యమేనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, సముద్రఖని తదితరులు నటించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే అందించాడు. సాగర్ కే చంద్ర సినిమాకు డైరెక్టర్ మరియు సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…..సినిమాలో రాకపోయింటే రాజకీయాల్లో కూడా ఉండేవాడిని కాదని నాకు అన్నం పెట్టింది సినిమానే అని, నా రాజకీయ పన్నుల్లో బిజీగా ఉన్న షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ చక్కగా ప్లాన్ చేసి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసారని చెప్పారు. తొలిప్రేమ, ఖుషి సినిమాలను ఎంతటి భాద్యతతో చేసానో ఈ సినిమా కూడా అంతే భాద్యత తో చేసానని చెప్పారు.

ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ గురించి మాట్లాడుతూ తను నల్గొండ వాసి అని సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. ఈ విధంగా తన కెరియర్ లో సినిమాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమానే తనకు ఇంతమంది అభిమానులను భిక్షగా అందించింది అంటూ పవన్ కళ్యాణ్ ఈ వేడుకలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.