కమిట్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తేజస్విని.. అడగడం కోసం భయపడే వాళ్ళు అంటూ కామెంట్స్!

తేజస్విని మదివాడ పరిచయం అవసరం లేని పేరని చెప్పాలి.ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన తేజస్విని హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.ఇకపోతే ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ఐస్ క్రీమ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో ఎంతో బోల్డుగా కనిపించిన తేజస్విని ఈ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె కమిట్మెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కమిట్మెంట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనని కమిట్మెంట్ అడగాలంటే భయపడేవారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను నటించిన కమిట్మెంట్ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో కాస్త బోల్డ్ సీన్స్ ఉండటం వల్ల ఈ సినిమా పలు వివాదాలను ఎదుర్కొంది.ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల నడుమ ఈ సినిమా 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ సినిమాలో తనతో హీరో రొమాన్స్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారని తేజస్విని వెల్లడించారు. ఇక తాను సినిమాలో విషయానికి వస్తే కంటెంట్ డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి అలాగే లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి కూడా వెనకాడనని తెలిపారు. ఇలా ఈ సినిమా గురించి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కమిట్మెంట్ సినిమా ద్వారా తను ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.