చేసేవి పాడు పనులు.. చెప్పేవి నీతులు.. అంటూ శ్రీ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేసిన తేజస్వి!

Tejaswi Madivada

తేజస్వి మదివాడ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కేరింత సినిమాల ద్వారా తనకంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే ఈమె రామ్ గోపాల్ వర్మ కంట్లో పడడంతో ఐస్ క్రీమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలావుంటే ఇటీవల ఈమె నటించిన కమిట్మెంట్ సినిమాలో చాలా బోల్డ్ పాత్రలో నటించింది తేజస్వి. ఇక ఈ సినిమా ఆగస్ట్ 19వ తేదీన విడుదల అయ్యింది. ఆ సినిమా విజయం గురించి పక్కన పెడితే..ఆ నేపథ్యంలో జరిగిన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజస్వి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.

ఇదిలావుంటే ఇక తేజస్వి మాట్లాడుతూ.. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉంటానని కానీ ఆఫర్లు రావడం లేదు అని ఆమె తెలిపింది. ఇక అంతేకాదు ఇప్పటివరకు కేరింత సినిమాలో లాంటి పాత్ర దొరకలేదు అని కొంచెం అసహనం కూడా వ్యక్తం చేసింది తేజస్వి.. పోతే కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ తెలిపిన ఈమె 21 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను అని, ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు అని కూడా వెల్లడించింది. అయితే అంతేకాదు ఈ సినిమా మహిళా సాధికారత గురించి చర్చించే సినిమా.. మరో డర్టీ పిక్చర్ లాంటిది అంటూ ఆమె వెల్లడించింది.

అయితే ఈ సినిమా తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందని, కమిట్మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి కూడా కొంచెం ఉంటుంది.. అంతేకాదు అలాగే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఇందులో యాడ్ చేశామంటూ ఆమె తెలిపింది. ఇక శ్రీ రెడ్డి చేసే పనులన్నీ చేసి ఇప్పుడేం తెలియని అమాయకురాల్లాగా మాట్లాడుతోందంటు.. అన్నీ కానిచ్చేశాక ఇతరులపై నిందలు వేయడం ఎందుకో ఆమెకు అర్థం కావడం లేదు అంటూ చర్చలకు దారితీసింది తేజస్వి. కమిట్మెంట్ సినిమాలో శ్రీరెడ్డి బాగోతాలు కొన్ని తెలియజేసే ప్రయత్నం చేసాము.. అలాగే రాంగోపాల్ వర్మ క్యారెక్టర్ కి సంబంధించి కూడా కొన్ని అంశాలు జోడించడం జరిగింది అంటూ ఆమె వెల్లడించింది.

అయితే ఇక ఇలాంటి ఎన్నో విషయాలు కమిట్మెంట్ సినిమాలో ఉన్నాయని ఇక ఈ సినిమాలో తన పేరు కూడా తేజస్వి అంటూ చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. శ్రీరెడ్డి గురించి కూడా ఆమె మాట్లాడుతూ చేసేవన్ని పాడు పనులు.. చెప్పేవి శ్రీరంగనీతులు అంటూ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అన్ని కానిచ్చేశాక ఇతరులపై నిందలు వేయడం ఎందుకో నాకు మాత్రం అర్థం కావడం లేదు అంటూ తేజస్వి శ్రీరెడ్డి గురించి ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పై తేజస్వి చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.