శ్వేతాబసు రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళిన విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పింది ..?

శ్వేతాబసు ప్రసాద్ గురించి ఈ మధ్య పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్త తో విడాకులు తీసుకున్న శ్వేతాబసు రీసెంట్ ఒక ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. స్వయంగా తానే ఈ విషయాలను వెల్లడించడం తో ఇప్పుడు అంతటా శ్వేతాబసు హాట్ టాపిక్ గా మారింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.

చిన్నప్పుడే బాలనటిగా అవార్డు అందుకున్న శ్వేతాబసు కి హీరోయిన్ గా కూడా డెబ్యూ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో యంగ్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే రైడ్, కాస్కో, కళావర్ కింగ్ లాంటి కొన్ని సినిమాలు చేసింది. కాని డెబ్యూ సినిమాకి వచ్చినంత పేరు మాత్రం దక్కలేదు. మెల్లగా టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. సరిగ్గా అదే సమయంలో సెక్స్ రాకెట్ లో దొరికి పలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది.

ఆ తర్వాత మొత్తానికి కనిపించకుండా పోయింది. అయితే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ని శ్వేతా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. సంవత్సరంలోగానే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా ప్రస్తుతం శ్వేతాబసు ఒక హిందీ సినిమా చేస్తోంది. ‘ఇండియా లాక్డౌన్’ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా సెక్స్ వర్కర్ ‘మెహ్రునిస్సా’గా శ్వేతాబసు కనిపించనుంది. అయితే కథలో భాగంగా శ్వేతాబసు దర్శకుడితో కలిసి ముంబై రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చిందని సెక్స్ వర్కర్స్ పడే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నాని తెలిపింది. దాంతో ఈ పాత్ర చేసేందుకు తనకి చాలా సులభం అవుతుందని వెల్లడించింది శ్వేతాబసు.