కెమెరామెన్స్ చేసిన పనికి అసహనం వ్యక్తం చేసిన సూర్య.. ప్లీజ్ వద్దంటూ అభ్యర్థన?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని వారంటూ ఉండరు. అటు తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్యకి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయటం వల్ల తెలుగు ప్రేక్షకులు కూడా సూర్యకి అభిమానులుగా మారారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య ప్రస్తుతం వాడీవాసల్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. సూర్య హీరోయిన్ జ్యోతికని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ఇద్దరూ పిల్లలు.

ఎప్పుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండే సూర్య కొంచెం సమయం దొరకగానే కుటుంబంతో కలిసి సమయం గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఇటీవల సూర్య తన భార్య పిల్లలతో కలిసి ముంబై వెళ్ళాడు. అక్కడ సూర్య తన ఫ్యామిలీతో కలిసి ఒక హోటల్ కి వెళ్ళారు. తర్వాత సూర్య తన ఫ్యామిలీతో కలిసి హోటల్ నుండి బయటికి వస్తున్న సమయంలో కెమెరామెన్ వారిని ఫోటోలు తీయటానికి అత్యుత్సాహం చూపించారు. ఈ క్రమంలో సూర్య కెమెరామెన్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

సూర్య జ్యోతిక తమ పిల్లలతో కలిసి ముంబైలోని బాస్టియనల్ వోర్లీ హోటల్ కు వెళ్లారు. అక్కడినుండి బయటకు వచ్చిన తర్వాత సూర్య, జ్యోతిక లను ఫోటోగ్రాఫర్లు పలకరిస్తూ ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సూర్య, జ్యోతిక కూడా ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడి నుంచి కారు దగ్గరకు వచ్చారు. అయితే ఫోటోగ్రాఫర్స్ అంతటితో ఆగకుండా సూర్య పిల్లలను కూడా ఫోటోలకు ఫోజులివ్వమంటూ వారిద్దరి ఫోటోస్ తీయటానికి ప్రయత్నం చేశారు. దీంతో సూర్య కెమెరామెన్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కెమెరాలకు చెయ్యి అడ్డం పెట్టి మా పిల్లల్ని మాత్రం ఫోటోలు తీయకండి ప్లీజ్ వారిని వదిలేయండి అని అన్నారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.