బాలయ్య వల్లే కథ మారిపోయిందట.!

filmcompanion_2023-01_9e0e600b-610a-402d-a21c-a03567b1ceb1_Review_Lead__Veera_Simha_Reddy__1

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మరో మాసివ్ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి”. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ లేటెస్ట్ సినిమా బాలయ్య కెరీర్ లో మరో గట్టి హిట్ గా నిలవడమే కాకుండా తన కెరీర్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా అయితే ఇది నిలిచింది.

ఇక ఈ చిత్రం చాలా కాలం తర్వాత బాలయ్య నుంచి వచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యం సినిమా కాగా ఈ సినిమాపై క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఐడియా అసలు బాలయ్య దే అని దర్శకుడు గోపీచంద్ చెప్పడం ఆసక్తిగా మారింది. మరి తాను అయితే వీరసింహా రెడ్డి కన్నా ముందు బాలయ్య కోసం వేరే కథని రెడీ చేయగా బాలయ్య మాత్రం అఖండ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి ఇంకా మంచి కథ చేయమని సజెస్ట్ చేశారట.

ఇప్పుడు అంచనాలు మరింత ఎక్కువ ఉంటాయి అని చెప్పడంతో తాను వీరసింహా రెడ్డి కథ ప్రిపేర్ సెట్ చేసినట్టుగా తాను తెలిపాడు. దీనితో బాలయ్య వల్లే కొత్త కథకి మారినట్టు చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ గా హానీ రోస్, అలాగే శృతి హాసన్ లు నటించగా థమన్ సంగీతం అందించాడు అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.