ఆ డైరెక్టర్ ను ఇప్పటికీ తిడుతూనే ఉంటా… మహేష్ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: సంగీత

ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగీత తన అందం అభినయంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో 2009లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2010లో విడుదలైన కారా మజాకా సినిమాలో చివరిగా నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగీత ఇటీవల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.

పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి పాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన సంగీత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లిగా నటించింది. ఈ సినిమాలో సంగీత చెప్పే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో కూడా నటించింది.

ఇటీవల “మసూద” అనే హారర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ షోలో పాల్గొన్న సంగీత అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో సరిలేరు నీకు ఎవరు సినిమాలో నటించడం వల్ల మీకు మంచి జరిగిందా? లేక చెడు జరిగిందా? అని యాంకర్ ప్రశ్నించగా రెండు జరిగాయి అంటూ సంగీత సమాధానం ఇచ్చింది. సరేలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక కి తల్లి క్యారెక్టర్ లో నటించడం వల్ల నాకు అప్పటినుండి అలాంటి క్యారెక్టర్లే వస్తున్నాయని ఈ సందర్భంగా సంగీత వెల్లడించింది. అందువల్ల అనిల్ రావిపూడి ఎక్కడ కనిపించినా కూడా ఇప్పటికీ తిడుతూనే ఉంటాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.