స్టేజీ మీదనే కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ మనో.. వెక్కి వెక్కి ఏడ్చారు

singer mano emotional on akka evare athagadu stage

అక్కా ఎవరే అతగాడు.. అనే స్పెషల్ ప్రోగ్రామ్ ను ఈటీవీలో దసరా కానుకగా ప్రేక్షకుల కోసం అందిస్తున్నారు. ఈ షోలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని చెబుతున్నారు. ఈ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్, రష్మీ, నవదీప్, సంగీత, వర్షిణి లాంటి వాళ్లు పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

singer mano emotional on akka evare athagadu stage
singer mano emotional on akka evare athagadu stage

అయితే.. ఇదే షోకు సింగర్ మనో గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా సూర్యుడే సెలవని.. అనే పాటను ఆలపించారు. ఈ ప్రోగ్రామ్ లో లెజండరీ సింగర్ బాలు గారిని అందరూ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పాట పాడుతూ.. మనో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చేశారు. బాలుతో తనకున్న అనుబంధాన్న ఈ సందర్భంగా మనో గుర్తు చేసుకున్నారు.

ఎంతో మందికి దారి చూపిన మంచి మనసున్న వ్యక్తి బాలు గారు. ఆయన్ను చూస్తూ నేను పెరిగా.. అని మనో ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడంతో సెట్ లో ఉన్నవాళ్లు కూడా కంటతడి పెట్టారు. ప్రతి ఒక్కరు బాలును గుర్తు తెచ్చుకొని ఏడ్చారు.

వావ్.. ఒక వ్యక్తికి ఇంతకన్నా గొప్పగా నివాళి ఇంకెలా ఇస్తాం. ఎంతైనా బాలు గ్రేట్. అందుకే.. ఆయన కోసం ఇంకా ఎన్నో లక్షల కళ్ల నుంచి కన్నీటి ధార కారుతూనే ఉంది.

అక్కా ఎవరే అతగాడు స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా చూసేయండి మరి..

Akka Evare Athagadu Latest Promo 04 - #Dasara Special Event - Sangeetha,Varshini,Sudheer,Navdeep