గ్రేట్ : “సింహాద్రి” రీరీలీజ్ వసూళ్లు ఏం చేస్తారంటే.!

రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ల ట్రెండ్ అయితే బాగా ఊపందుకున్న సంగతి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రీ రిలీజ్ లు ఫ్యాన్స్ ఘనంగా ప్లాన్ చేసుకుంటూ ఈ సినిమాలకి వస్తున్న వసూళ్లను పలు సేవా కార్యక్రమాలకి గాను లేదా పొలిటికల్ గా పార్టీ ఫండ్ గా అయితే విరాళము అందిస్తున్నారు.

అలా ఇప్పటివరకు వచ్చిన మహేష్, పవన్, రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ ల సినిమాలు వసూళ్లుకి చేశారు. ఇక ఇప్పుడు భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వస్తున్న మరో మాస్ రీ రిలీజ్ సినిమానే “సింహాద్రి”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా వసూళ్ళని ఏం చేస్తారో అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ డబ్బులు మొత్తం కూడా మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే వెళ్లాయట. అయితే ఇందులో ఏమంత గ్రేట్ ఉంది? అనుకుంటే.. ఉంది. ఈ డబ్బులను ఆయా ప్రాంతాల్లో ఆర్ధికంగా చాలా వెనుకబడి ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే  అందించి వారికి ఎంతో కొంత అండగా ఉన్నట్టు అవుతుంది అని ఇలా ప్లాన్ చేశారట.

అయితే ఇందులో వారిని ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబూస్టర్స్ కొందరిని ఎంపిక చేసి సింహాద్రి కి వచ్చిన వసూళ్ళని సమానంగా పంచి పెట్టనున్నారని తెలుస్తుంది. ఇది మాత్రం నిజంగా ఓ మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఈ మే 20 నుంచి అయితే వారం రోజులపాటుగా ప్రదర్శన కు ఉండనుంది.