శృతిహాసన్ వల్లే ‘వకీల్‌ సాబ్‌’కు అంతరాయమా?

Shruthi Hassan and Pawan Kalyan in Vekeel Saab
క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ వల్లే  ‘వకీల్‌ సాబ్‌’ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగిందట. అవును. ఈ విషయం గురించే ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. పవన్‌కల్యాణ్‌కి జంటగా శృతిహాసన్ ‌ సందడి చేయనున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’.
 
Shruthi Hassan and Pawan Kalyan in Vekeel Saab
Shruthi Hassan and Pawan Kalyan
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి  హైదరాబాద్‌లో  షూటింగ్  జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శృతిహాసన్ సెట్సుకు  రాలేదు.  డిసెంబర్‌లో  ‘వకీల్‌ సాబ్‌’ తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని యూనిట్  వర్గాల ద్వారా తెలిసింది. అసలు ఇప్పటికే శృతిహాసన్ సెట్ లో  పాల్గొనాల్సిందట. ఆమె హ్యాండ్ ఇవ్వడంవల్ల  కొంత అంతరాయం ఏర్పాడినమాట నిజమే అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. యూనిట్  వర్గాలు కూడా ఈ విషయంలో ఆందోళన చెందిందని సమాచారం.
 
ఫలితంగా  పవన్‌, ఇతర తారాగణంపై షూటింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం  తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట. వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై పది నుంచి పదిహేను రోజులపాటు చిత్రీకరణ చేస్తారని తెలిసింది. దాంతో సినిమా షూటింగ్‌ అంతా పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో శృతిహాసన్‌ కనిపించేది కాసేపే. అయితే… పవన్‌, శృతిహాసన్ ది  హిట్‌ జోడీ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
 
‘గబ్బర్‌ సింగ్‌’లో తొలిసారి ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘కాటమరాయుడు’లో సందడి చేసింది. ఇప్పుడీ ‘వకీల్‌ సాబ్‌’లో మూడోసారి జోడీగా కనిపించనున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.