“గేమ్ ఛేంజర్” విషయంలో షాకింగ్ ‘పవర్’ ఫ్యాక్ట్.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సెన్సేషన్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని రీసెంట్ గానే “గేమ్ ఛేంజర్” అంటూ సాలిడ్ టైటిల్ తో అయితే రిలీజ్ చేయగా దీనికి అదిరే రెస్పాన్స్ వచ్చింది.

మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విషయంలో స్టార్టింగ్ లో అయితే పలు క్రేజీ టాపిక్స్ బౌయటకి వచ్చాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఉంటారని పలు ఎగ్జైటింగ్ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఇంతకు మించిన ఎగ్జైటింగ్ వార్త దిల్ రాజు నేరుగా రివీల్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా కథని మొదటిసారిగా శంకర్ తనకి చెప్పినపుడు తాను ఎవరితో సినిమా చేయాలని అనుకుంటున్నారని అడగ్గా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ లాంటి హీరో అయితే బాగుంటాడని శంకర్ చెప్పారని అసలు విషయం రివీల్ చేసాడు.

అంటే అసలు ఈ సినిమానే పవన్ దగ్గరకి వెళ్ళాల్సింది కాగా దిల్ రాజు అయితే శంకర్ తో పవన్ కన్నా రామ్ చరణ్ తో బాగుంటుంది అని రివీల్ చేయడం షాకింగ్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా పవన్ నుంచి చరణ్ కి వెళ్ళింది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో అయితే కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.