పూరి జగన్నాధ్.. కొడుకు సినిమా విషయంలో షాకింగ్ డెసిషన్ ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకుని మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో ఆకాష్ మాస్ హీరో అవుతాడని ప్రూవ్ చేసుకున్నాడు. మెహబూబా చూసిన ప్రతీ ఒక్కరు ఆకాష్ హీరో మెటీరియల్ అని ఖచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరో అవుతాడని బ్లెస్ చేశారు. ఈ క్రమంలో ఆకాష్ తో పూరి సెకండ్ మూవీ ని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదు. స్క్రిప్ట్ తో పాటు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Puri Jagannadh Shares New Poster of Akash Puri, Ketika Sharma Starrer  Romantic

ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అంతేకాదు తాజాగా సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉందట. కంప్లీట్ గా యూత్ ని టార్గెట్ చేసుకొని తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ తో బాగా బజ్ క్రియేట్ అయింది. పక్కా ఈ సినిమాతో ఆకాష్ కి సాలీడ్ హిట్ దక్కబోతోందని అంటున్నారు. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమా థియోటర్స్ లోనే రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియోటర్స్ ఓపెన్ అయినప్పటికి వ్యాపార దృష్ఠితో చూస్తే వసూళ్ళు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అందుకే పూరి డేర్ చేసి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడయినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి జీ5 నుండి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందని.. దాదాపు ఈ ఆఫర్ కి పూరి ఒకే చెప్పే అవకాశాలే ఉన్నాయని సమాచారం. కాగా ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించారు. యంగ్ బ్యూటి కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటించింది. పూరి మార్క్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి తెరకెక్కించాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.