షాకింగ్ : “పుష్ప 2” నటులకి యాక్సిడెంట్.!

టాలీవుడ్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప” తో తాను మాస్ క్రేజ్ తెచ్చుకోగా రీసెంట్ గా దీని సీక్వెల్ నుంచి వచ్చిన టీజర్ వీడియో సహా ఫస్ట్ లుక్ లకి అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ లు వచ్చాయి.

మరి ఈ భారీ సినిమా ని దర్శకుడు సుకుమార్ ఇప్పుడు శరవేగంగా ఇండియా వైడ్ గా తెరకెక్కిస్తుండగా రీసెంట్ గానే వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ తన కీలక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై షాకింగ్ న్యూస్ అయితే ఒకటి బయటకి వచ్చింది.

కాగా ఈ న్యూస్ ప్రకారం అయితే పుష్ప 2 షూటింగ్ లో ఓ కీలక సన్నివేశం కోసం కొందరు నటుల్ని ఎంపిక చేయగా వారిని షూటింగ్ స్పాట్ ని ప్రొడక్షన్ కంట్రోల్ వారు ఒక బస్సు లో తీసుకెళ్తున్నారు. మరి వారికి అయితే ఊహించని విధంగా విజయవాడ హైదరాబాద్ హై వే లో అయితే మరో బస్సుని ఢీ కొని యాక్సిడెంట్ జరిగింది అట.

అయితే ఈ ప్రమాదంలో పుష్ప నటులు తీవ్ర గాయాలు పాలయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి చేదు అంశాలు జరగడం సినిమా విషయంలో కాస్త కంగారు పెట్టిస్తామని చెప్పాలి. కాగా వారు అయితే త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ ఉండబోతుంది.