క్రికెటర్ కోసం షారుఖ్ కాస్ట్లీ గిఫ్ట్

ఐపీఎల్ ఎంతో మందిని స్టార్ క్రికెటర్స్ గా ప్రపంచానికి పరిచయం చేసింది. దేశవాళీ మ్యాచ్ లలో కూడా అవకాశాలు రాని వారికి ఐపీఎల్ అద్భుతమైన ఛాన్సులు అందించింది. ఇండియాలో ఎంతో మంది యువ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

అలాగే ఇండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా ఆడే అవకాశాలు పొందారు. 2023 ఐపీఎల్ లో కూడా చాలామంది యువ క్రికెటర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక్క మ్యాచ్ తో హీరోలుగా మారిపోతున్నారు. అలాగే కోల్ కత్తా నైట్ రైడర్స్ టీంలో రింకు సింగ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ లో 5 బంతుల్లో 28 పరుగులు సాధించి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలిపించాడు.

ఆ ఒక్క మ్యాచ్ తో రింకు సింగ్ హీరోగా మారిపోయాడు. చివరి ఓవర్ లో వరుసగా 5 సిక్స్ లు కొట్టి అసాధ్యం అనుకున్న మ్యాచ్ ను గెలిపించారు. ఆ తర్వాత కూడా మంచి ఇన్నింగ్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా రింకూ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

దాంతోపాటు ఇప్పుడు సర్ప్రైజింగ్ గిఫ్ట్ షారుఖ్ ఖాన్ రింకు సింగ్ కి ఇవ్వబోతున్నారంట. అయితే ఆ గిఫ్ట్ ఏంటి అనేది రింకు సింగ్ చెప్పలేదు కానీ ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేశారు. అది వెడ్డింగ్ గిఫ్ట్ అని, దానికి చాలా ప్రత్యేకత ఉంది అంటూ చెప్పారు.

అయితే అది ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గాని ఉంచడం విశేషం. మొత్తానికి ఒకే ఒక్క మ్యాచ్ తో సెన్సేషన్ గా మారిపోయిన రింకు సింగ్ ఇప్పుడు షారుక్ ఖాన్ నుంచి ఊహించని సర్ప్రైజింగ్ అందుకోబోతున్నారు. అది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక రింకు సింగ్ దాటికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యశ్ దయాల్ తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను రిజర్వ్ బెంచ్ కి పరిమితం అయ్యారు.