కేబీసీ 12: ఈ సీజ‌న్‌లో తొలిసారి కోటిశ్వ‌రురాలు.. ఆ ప్ర‌శ్న‌తో ఏడు కోట్లు మిస్

బ్రిటన్ టీవీ షో ఆధారంగా రూపొందిన బుల్లితెర బిగ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి.2000 సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన ఈ షోకి మూడో సీజ‌న్‌లో షారూఖ్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. మిగ‌తా సీజ‌న్స్ అన్నీ అమితాబ్ బచ్చ‌న్ నిర్వ‌హించారు. రెండు ద‌శాబ్ధాల పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న ఈ షో ప్ర‌స్తుతం 12వ సీజ‌న్ జ‌రుపుకుంటుంది. ఈ సీజ‌న్‌లో తొలి సారి జార్ఖండ్ రాష్రానికి చెందిన మ‌హిళా నాజియా స‌సీం కోటి రూపాయ‌లు గెలుచుకుంది.

ఢిల్లీకి చెందిన నజియా న‌సీం మంగ‌ళవారం రోజు హాట్ సీట్‌లో కూర్చుంది. ఆ రోజు రూ. 40వేలు సంపాదించ‌గా, బుధ‌వారం ఎపిసోడ్‌లో కోటి దక్కించుకుంది. 11వ ప్ర‌శ్న వ‌ర‌కు ఎలాంటి లైఫ్ లైన్స్ వాడ‌ని న‌జియా త‌ర్వాత నుండి లైఫ్ లైన్స్‌ని చ‌క్క‌గా వాడుకుంటూ కోటి రూపాయ‌లు ద‌క్కించుకుంది. ఈ సీజ‌న్‌లో తొలిసారి న‌జియా కోటి రూపాయ‌లు ద‌క్కించుకోవ‌డంతో అమితాబ్ ఆమెకు స్టాండింగ్ ఓవేష‌న్ ఇచ్చారు. అంతేకాదు కోటి రూపాయ‌ల‌తో పాటు దీపావ‌ళి గిఫ్ట్‌, చాక్లెట్ హ్యాంపర్, ఆమె కుమారుడికి స్కాల‌ర్ షిప్ ల‌భించింది.

ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న నటి ఎవరు? అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం రూపా గంగూలీ అని ఠక్కున నాజియా సమాధానం చెప్పారు. ఇక‌ ఆమె రూ.7కోట్ల ప్ర‌శ్న‌కు కూడా స‌రైన స‌మాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలుచుకుంటారని అంతా భావించారు. కాని తాను ఆ రిస్క్ చేయ‌లేక‌పోయింది. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఆజాద్ హింద్ ప్ర‌భుత్వం మొదటి ప్రకటన సింగపూర్‌లో ఎక్కడ చేశారు? A) Cathay Cinema Hall B) Fort Canning Park C) National University of Singapore D) National Gallery Singapore ఆప్షన్లు ఇచ్చారు.కరెక్ట్‌గా గెస్ చేయ‌లేక‌పోవ‌డంతో మ‌ధ్య లో నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది.