Sai Dharam Tej : సినిమా ఎంపిక విషయంలో పంథా మార్చుకున్న సాయి ధరమ్ తేజ్…?

Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి పాటలను ఎక్కువగా రీమిక్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే ఇటీవల ఒక రోడ్డు ప్రమాదానికి గురి అయిన సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిస్ట్చార్జ్ అయ్యాక ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ సమయంలో సినిమాలకు చాలా దూరంగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

అయితే ప్రస్తుతం కోలుకున్న తరువాత యాక్సిడెంట్ కారణంగా బ్రేక్ పడిన తన 15వ చిత్రాన్ని పట్టా లెక్కిస్తున్నారు.కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అందరి ఆసక్తి ఈ సినిమా మీదనే ఉంది. యాక్సిడెంట్ తర్వాత ఇంట్లో గడిపిన సమయంలో సినిమాల ఎంపిక విషయంలో సాయి ధరమ్ తేజ్ తన దారిని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లు విషయం లేకుండా ఏవేవో సినిమాలు చేశాను అని, మధ్యలో యాక్షన్ చేశాను అని, అసలు తాను యాక్షన్ చేస్తే ఎవ్వరూ చూడరని సాయి తేజ్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇకపైన తను తీసే సినిమాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారట. ఎక్కువగా కామెడీ జోనర్ ఉన్న సినిమాలు ఎంపిక చేసుకోవాలి అని ఆలోచనలో కూడా ఉన్నారట.

అంతేకాకుండా దర్శకుల విషయంలో కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎక్కువగా విషయం ఉన్న డైరెక్టర్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. సాయి ధరమ్ తేజ్ తర్వాత చిత్రం ప్రవీణ్ సత్తారు తో తీయనున్నట్టు సమాచారం. అయితే ఇదీ ఆక్షన్ సినిమానే అయినా ప్రవీణ్ సత్తార్ మీద నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నాడట. మొత్తానికి యాక్సిడెంట్ తర్వాత తన పంథా మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఎలాంటి విజయాలు అఅందుకుంటాడో వేచి చూడాలి.