RRR: హౌరా వంతెనపై హంగామా చేసిన ఎన్టీఆర్, చరణ్, జక్కన్న…!

RRR:దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది అని,మొదటి రోజే ఈ సినిమా ఈజీగా వందకోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.

పలుసార్లు వాయిదా పడ్డ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య రానుంది. కొన్ని రోజుల్లోనే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్  చేస్తున్నారు. విడుదలకు మరో రెండు రోజులే ఉండటంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు.ఇప్పటికే బెంగుళూరు, గుజరాత్, ఢిల్లీ లలో పర్యటించారు. తాజాగా జైపూర్, ఇప్పుడు కోల్కతా చేరుకుంది.కోల్కతా చేరుకున్న టీమ్ అక్కడ హౌరా బ్రిడ్జ్ తిలకించి మీడియాతో ముచ్చటించారు.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఎలాంటి గందరగోళం లేకుండానే రాజమౌళి తో పాటు స్టార్ హీరోలు అక్కడే బ్రిడ్జ్ దగ్గర మీడియాతో ముచ్చటించారు.. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బుధవారం తో రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ ఈ ప్రొమోషన్స్ కు బ్రేక్ ఇచ్చి ఫైనల్ గా హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ముచ్చటించి ప్రొమోషన్స్ కి బిగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారు.  సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో అందరిలోనూ ఎలాంటి విజయం సాధిస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది.