RRR : కొమ్మ ఉయ్యాలా… అంటూ పాడిన మల్లి ఎవరో తెలుసా..?

RRR: రాజమౌళి మాస్టర్ మైండ్ తో తీసిన చిత్రం త్రిబుల్ ఆర్ ఇక ఈ చిత్రం విడుదలయి సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ముచ్చటే. ఇక ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా విడుదలయి అన్నిచోట్లా రచ్చ చేస్తోంది. ఇక చరణ్,ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మళ్లీ పాత్రలో నటించిన అమ్మాయి గురించి అందరి దృష్టి పడింది. సినిమాలో మళ్లీ పాత్ర నిడివి తక్కువగా ఉన్న ఆ పాత్రే సినిమాకు ప్రధానం కావడం, ఆ పాప నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇంతకు ఈ పాప ఎవరంటే.. మల్లి పాత్రలో నటించిన పాప పేరు ట్వింకిల్ శర్మ. ఈ చిన్నారి చండీఘర్ రాష్ట్రానికి చెందింది. డాన్స్ ఇండియా డ్యాన్స్ అనే రియాలిటీ షోతో ఈ పాప మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాడ్ లో కూడా నటించింది ట్వింకిల్ శర్మ. ఆ యాడ్ లో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి మల్లి పాత్రకు ఎంపిక చేశారట. ‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాల అంటూ’ మల్లి పాడే పాటతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అవుతుంది.

రాజమౌళి తన సొంత ఖర్చులతో ఫ్లైట్‌లో ఆడిషన్ కు తెప్పించి ఓకే చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.“అన్నా.. అమ్మా యాదికొస్తుందే” అన్న మల్లి మాటలకు కదలని గుండె ఉండదు థియేటర్ లో. ఆ సమయంలో ఆమె అభినయం.. ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా నటిగా ట్వింకిల్ కు ఉన్న మెచ్చూరిటీని చూపిస్తాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ఈ క్యారెక్టరే ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.