ఐపీఎల్ 2025 సీజన్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కరుణ్ నాయర్, జస్ప్రీత్ బుమ్రా మధ్య వాగ్వాదం జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ముంబయి ఇండియన్స్ బౌలర్ బుమ్రా వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో కరుణ్ నాయర్ 2 సిక్సులు, 1 ఫోర్తో 18 పరుగులు బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు తీస్తూ బుమ్రాను ఢీకొన్న కరుణ్పై బుమ్రా అసహనం వ్యక్తం చేశాడు.
ఓవర్ ముగిసిన తర్వాత ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా సరిపెట్టుకోలేదు. ఈ ఘర్షణకు అంపైర్లు మధ్యలోకి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక వీరి వాగ్వాదం జరుగుతుండగా, ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో విచిత్రంగా నవ్వుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్మ్యాన్ సునిశితంగా స్పందించడం అభిమానులకు వినోదంగా మారింది.
ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ ధీర్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2/23, విప్రజ్ నిగమ్ 2/41 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు (12 ఫోర్లు, 5 సిక్సులు)తో అదరగొట్టాడు.
కానీ అతడు పెవిలియన్ చేరిన తర్వాత ఢిల్లీ ఆఖర్లో వరుసగా మూడు రనౌట్స్తో మ్యాచ్ను చేజార్చుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో అషుతోష్ శర్మ, కుల్దీప్, మోహిత్ వరుసగా రనౌట్ కావడంతో ఢిల్లీ తడిసి మోపెేసింది. ఒకవేళ కరుణ్ క్రీజులో కొనసాగి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదన్న అభిప్రాయం నెట్టింట వ్యాపిస్తోంది. మాటల గర్జన, బ్యాట్ల ధాటితో నిండిన ఈ మ్యాచ్ ముంబయికి కీలక విజయాన్ని అందించడంతో పాటు, కొత్త వివాదాన్నికూడా తెరపైకి తెచ్చింది.
The average Delhi vs Mumbai debate in comments section 🫣
Don’t miss @ImRo45 ‘s reaction at the end 😁
Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS
— Star Sports (@StarSportsIndia) April 13, 2025