‘రిపబ్లిక్’ సీక్వెల్‌కి రంగం సిద్ధం.!

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. పొలిటికల్ హీట్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తేజు రోడ్ యాక్సిడెంట్ టైమ్‌లో రిలీజై నెగిటివ్ ఫీడ్ బ్యాక్‌తో పక్కకి వెళ్లిపోయింది.

తేజు ప్రమోషన్లకు రాలేని పరిస్థితిలో వుండగా, పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనాల్సి వచ్చింది కూడా. అయినా ‘రిపబ్లిక్’ సినిమాని డిజాస్టర్ లిస్టులో పడేశారు. రీ ఎంట్రీలో తేజు ‘విరూపాక్ష’ సినిమాతో గట్టి హిట్టు కొట్టాడు. దాంతో, ‘రిపబ్లిక్’ సీక్వెల్ ఆలోచనలు చేస్తున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా.

ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన వుందని దేవ్ కట్టా అప్పుడే చెప్పాడు. అయితే, పవన్ కళ్యాణ్, తేజు కాంబినేషన్‌లో చేయాలని వుందన్నాడు. ఆ ఆలోచనను ఇప్పుడు కార్య రూపం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడనీ తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవ్ కట్టా అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఓ 20 రోజులు డేట్స్ తీసుకుంటే సరిపోతుంది.

మిగిలిన కథంతా తేజుతో నడిపించేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయొచ్చు. చూడాలి మరి, అన్నీ సెట్ అయితే, దేవ్ కట్టా అనుకున్నది వర్కవుట్ చేసేస్తాడేమో.