సూసైడ్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

పరిస్థితులు ఎప్పుడూ మనుషులకు అనుకూలంగా ఉండవని, ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా వాటిని చెదిరిపోకుండా నిలబడటమే గొప్ప విషయమని రేణ దేశాయ్ పేర్కొన్నారు. కొంతకాలం సామాజిక మాధ్యామాలకు దూరంగా ఉన్న ఆమె..ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ తో నెటిజన్లను పలకరించారు. ఈసారి ప్రేమలో మోసపోతే అనే ప్రశ్నకు కూడా ఆమె ఇచ్చిన ఆన్సర్ హైలెట్ గా నిలిచింది. పవన్‌ను ప్రేమ వివాహం అనంతరం ఆ తర్వాత విడాకులు తీసుకుని పిల్లలతోనే ఉంటున్న విషయం తెలిసిందే. బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తరువాత సినిమాలు చేయడం కూడా ఆపేసింది.

ఇక రచయిత ఆమె తనలోని ప్రతిభను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు తాను కవితలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆమె..మంచి భావోద్వేగాలను ప్రదర్శించేవారు. ఆ మధ్య ఇష్క్ వాలా అనే సినిమాతో దర్శకురాలిగా కూడా మారారు. ఇక నెక్స్ట్ ఆధ్య అనే వెబ్ సిరిస్ ద్వారా మళ్ళీ మేకప్ వేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఆమె ఒక జీవితానికి సంబంధించి కీలకమైన విషయంపై స్పందించారు. “ప్రేమలో ఓడిపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానిపై మీ ఒపినియన్ ఏమిటి చెప్పాలని? అలా సెన్సిటివ్ గా ఉండేవాళ్లకు ఒక సందేశం ఇవ్వమని నెటిజన్లు కోరగా ఆమె రెస్పాండ్ అయ్యారు. మన కంటే ఎవరు మీ లైఫ్ లో ఎవరూ ముఖ్యం కాదు. మీ జీవితం అన్నిటి కన్నా ఇంపార్టెంట్. ప్రేమలో విఫలమైతే అయితే బాధగా ఉంటుంది వాస్తవమే. ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ బాధను మర్చిపోవడం కష్టం. కానీ దానికి సూసైడ్ ఆప్షన్ కాకూడదు. అలాంటి సమయంలో డాక్టర్లను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా మంచిది” అని రేణు దేశాయ్ సూచించారు.

అదే విధంగా అలాంటి బాధలో నుంచి ఎలా ముందుకు వెళ్లాలని అంశంపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. కుటుంబం లేదా మిత్రులతో ఎక్కువగా గడపండని చెప్పారు. ఇక ఎప్పుడైనా సరే ఒక మనిషి లైఫ్ మరొక వ్యక్తి కారణంగా అంతం అనేది కరెక్ట్ కాదని రేణు దేశాయ్ తన మాటలతో మెస్మరైజ్ చేశారు.