పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న రష్మిక.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్స్ వైరల్!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్న ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ ఉండడమే కాకుండా మరోవైపు వరుస బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక గురించి గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.రష్మిక నేను చెబితేనే తన నిశ్చితార్థం రద్దు చేసుకుందని ఆమె స్టార్ హీరోయిన్ అవడం కోసం తన ఇంట్లో పూజలు చేశానంటూ ఈయన వెల్లడించారు. ఇక రష్మిక మరో రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తిరుగులేకుండా కొనసాగుతుందని ఈయన తెలిపారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.

రష్మిక తనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని త్వరలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ పదవికి పోటీ చేయబోతున్నారని ఈయన వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా అలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందని ఈ సందర్భంగా ఈయన రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు తెలియడంతో కొందరు రష్మిక చేతులారా తన సినీ కెరియర్ నాశనం చేసుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.