Rashmi Gowtham:ప్లీజ్ అలా చేయొద్దంటూ వేడుకుంటున్న రష్మీ…. పోస్ట్ వైరల్!

Rashmi Gowtham : బుల్లితెర పై రష్మీ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ మరియు ఇపుడు ఎక్సట్రా జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయింది రష్మీ గౌతమ్. ఇక సినిమాల్లోను అప్పుడప్పుడు మెరిసిన టీవీ షోలతో వచ్చినంత గుర్తింపు సినిమాలతో రాలేదు. గుంటూరు టాకీస్ వంటి సినిమా లతో అందాలు అరబోసిన ఫలితం కనిపించలేదు.

ఇక జబర్దస్త్, ఢీ డాన్స్ షో తో బాగా పేరు తెచ్చుకున్న రష్మీ తనకు సుధీర్ కు ఉన్న కెమిస్ట్రీ వల్లనే ఇంకా ఎక్కువగా పాపులర్ అయింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినా అదంతా కేవలం టిఆర్పీ కోసం మాత్రమే అని తెల్చేసింది రష్మీ.
ఇక లాక్ డౌన్ సమయం లో వీధి కుక్కలకు సహాయం చేస్తూ వైరల్ అయింది రష్మీ వీడియో . ఎప్పుడు సమస్యలపై స్పందించే గుణం తో జనాలలో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా మూగ జీవుల విషయం లో రష్మీ ఎక్కువగా స్పందిస్తారు. వాటికి హాని కలిగించవద్దని చాలా వీడియోల్లో చెప్తుంటారు సామాజిక మధ్యమాల్లో.

ఇపుడు కూడా మూగ జీవులకోసం మరోసారి పోస్ట్ పెట్టి అందరు ఆలోచించేలా చేసారు. షేవింగ్ చేసుకున్నాక వాడి పడేసిన బ్లేడ్లను చేత కుండీలో వేయరాదని ఎందుకంటే చెత్త కుండీల్లో ఆహారం కోసం మూగ జీవులు వెతికేటపుడు వాటికి బ్లేడ్లు తగిలి గాయాలవుతాయని అందుకే చెత్తకుండిల్లో బ్లేడ్లు వేయొద్దని అందరిని కోరింది.
ఇక ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు నిజమే ఈ విషయం చాలా మూగ ప్రాణులకు హాని కలుగుతుందంటూ స్పందించారు. మరికొంతమంది రష్మీ నువ్వు గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.