Ram Charan : మెగాపవర్ స్టార్ ది బంగారు మనసు అంటూ కాదంబరి ఆసక్తికర వ్యాఖ్యలు… ట్వీట్ వైరల్..!

Ram Charan : మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గురించి చాలా మంది సెలబ్రిటీలు ఆయన సేవ భావం గురించి చాలాసార్లు మాట్లాడారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు.ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్‌ గా కూడా ఉన్నారు.అయితే ఈయన మాటలు మరోసారి రామ్ చరణ్ మంచి మనసును తెలియజేశాయి. కాదంబరి చాలా సినిమా ల్లో కమెడియన్ గా నటించారు .270కి పైగా సినిమాల్లో నటించినా కాదంబరి లేటెస్ట్ గా రాజ రాజ చోర’ ‘థాంక్యూ బ్రదర్’ ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో కనిపించారు .‘మనం సైతం’ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నటుడు కాదంబరి.అయితే ఈ మధ్యకాలం లో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు.

తాజాగా ఈయన మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.ఈ కామెంట్స్ ను నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి కాదంబరి సామామాద్యమంలో ఇలా చెప్పుకోచ్చారు .“రామ్ చరణ్! అందరికీ తెల్సి ఒక పెద్ద స్టార్, మెగాస్టార్(మా అన్న) కొడుకు. కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బులులేకపోతే సుకుమార్ అన్న చొరవతో రాంచరణ్ ని అడుక్కొని 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసాను.అవికాక సుక్కన్న,మనం సైతం* ,విజయ్ అన్న, రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున ఎఫ్ డి చేయమని ఇవ్వడం జరిగింది.

ఇక సహాయం చేయడం ఒకటైతే మళ్ళీ వాళ్ళను గుర్తుపెట్టుకుని బాగోగులు అడగడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని కాదంబరి తెలిపారు.* రాంచరణ్* “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?” అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇపుడు ఈ బ్రహ్మాజీ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.